RK 9 channel రాష్ట్రానికి మళ్లీ మళ్లీ సీఎం జగన్ అవ్వాలని మంత్రి రోజా

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2023
  • రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ సి.ఎం గా జగన్ అవ్వాలి: మంత్రి రోజా
    కార్తీకమాస మహా పర్వదినాలు పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలు దర్శనాల్లో భాగంగా శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామికి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు రోజా,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,వైఎస్సార్ సిపి పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి రోజాకు టి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి నిర్వహించిన విశేష పూజలు అనంతరం నంది మండపం వద్ద వేద స్వస్తి పలికి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోజా మీడియా తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పంచారామాలు దర్శనంలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. భీమేశ్వర ఆలయం యోగ లింగమని యోగముంటేనే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ అవ్వాలని, రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ దూరం అవ్వాలని మంచి పరిపాలన అందించేందుకు స్వామివారి అమ్మవారి ఆశీస్సులు తమ వుండాలని కోరినట్లు రోజా పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 15 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణను మంత్రి రోజా,హౌసింగ్ చైర్మన్ దొరబాబులు నిర్వహించారు. పండుగ వాతావరణం లో నిర్వహించనున్న ఈ క్రీడా పోటీల్లో యువతే కాకుండా ఉత్సాహంతులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు సామర్లకోట పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్లు వూబా జాన్ మోజెస్, నెక్కంటి సాయి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు

Комментарии • 1