E78 | వరిలో కలుపు నివారణి వాడే విధానం | Organic Paddy Weedicide |
HTML-код
- Опубликовано: 4 окт 2024
- వ్యవసాయంలో వరి రైతులను వేదిస్తున్న ప్రధాన సమస్య.. కలుపు. కలుపును నివారించే క్రమంలో వేలాదిమంది రైతులు రసాయన మందులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో... సమస్యను కొంతవరకైనా పరిష్కరించేందుకు గ్రామ బజార్ బృందం కృషి చేస్తోంది. గల్లా చంద్రశేఖర్ నాయుడు తయారుచేసిన సహజ కలుపు నివారణి వీడ్జాప్ సమర్థవంతంగా వరిలో పనిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు వాడి అద్భుత ఫలితాలు సాధించారు. అయితే కలుపు నివారణి వాడే విధానం, ఎంత మోతాదులో ఉపయోగించాలన్న విషయాలపై పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం.....
GramaBazaar: 9491278836, 8331800100
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి
Murali 98668 51525|Gramabazaar|833 1800 100-9491278836
సర్ నేను 8 ఎకరాలు పొలం సాగు చేసిన అంత భూమి బావి నీరు పారు తుంది గడ్డి బాగానే పడుతోంది నాకూ గ్రామ బజార్ మందు కావాలి ఎక్కడ దొరుకుతుంది తేలు పాగా ఆరు 👃🌹
రెండు ఇంచులు నీళ్లు ఉన్నప్పుడు కలపనేది రాదు. దీంట్లో మీ మందు గొప్పతనం ఏం లేదు. ఇది ఒక విధంగా రైతులను మోసం చేసిన కిందికి అయితది
మందు హైదరాబాదులో ఎక్కడ దొరుకుతుంది సార్ దయచేసి చెప్పగలరు
ఎర్రగడ్డ, ESI హాస్పిటల్ దగ్గర మన గ్రామ బజార్ ఆఫీస్ ఉంది. మీరు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకోగలరు. గ్రామ బజార్ మొబైల్: 94912 78836, 833 1800 100
All videoec
Dap lo kalipi veyacha
pls contact 9491278836 /8331800100
Sir Mulberry(Sericulture) crop lo vadacha
LEDANDI VAADARAADU
వాడవచ్చు. సంప్రదించండి గ్రామ బజార్: 94912 78836, 833 1800 100
Drum seeder ద్వారా వేసిన వరికి ఎలా వాడుకోవాలో తెలుపగలరు
వివరాల కోసం గ్రామ బజార్: 833 1800 100, 94912 78836 ను సంప్రదించండి.
ఎటువంటి గడ్డి కి పనిచేస్తుంది .ఇదికూడా ఒకరక మైనా విశమే కదా చేతులతో కలుప కూడదు కదా ఒక పంటకి ఒకసారి వాడితే చివరి వరకు పని చేస్తుందా పత్తి,మీర్చిలో .పంటలకు పని చేస్తుందా వివరాలు చెప్పండి sir.ట
మీరు అన్నట్లు మా ఈ వీడ్జాప్ కషాయం వరిలో కులుపును నివారిస్తుంది. కానీ ఇది రసాయనం కాదు. కేవలం ఆకుల రసంతో తయారుచేసిన కషాయం. చేతులతో కలపటం తాదు… నేరుగా తాగిన కూడా విషపూరితం కాదు. ఇది మొదట కలుపును నివారించి, తర్వాత పంటకు ఎరువుగా పనిచేస్తుంది. మా సహజ కషాయాలు పత్తి, మిరప పంటల్లోనూ ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. ఇదివరకే మన కషాయాలు వాడిన చాలా మంది రైతులకు సంబంధించిన వీడియోలు ఇక్కడ ఉన్నాయి.
ruclips.net/video/wKCQ2dAkIkA/видео.htmlsi=T_Dbedym0FRyJYb3
ruclips.net/video/tSbYuH46YRM/видео.htmlsi=V033JVP_BIrVvu7C
ruclips.net/video/LeCgrqlqBoo/видео.htmlsi=NJdswAit-9ZGJoIW
కషాయాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 ని సంప్రదించండి.
🙏sir,Isuka polam lo dhammu chesina roje naatu vesthaaru kada mari kalupu mandhunu kuda adhe roju vesukovacha
Vesukovachhu. call murali for further clarifications on 9866851525
3.price.
వివరాల కోసం గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
Nalgonda lo dorkuthunda
Hyderabad nundi RTC Cargo lo pampistaamu
👍
Dhanyavaadamulu
Ekkada dorukutundi, by corier lo pamputara.phonenumber ivvandi
call 9491278836 for information
వరి లో ఎకరానికి మూడు లీటర్లు ఆఖరి దుక్కిలో ఒక్కసారి వాడితే చాలా హైదరాబాద్ లో ఎక్కడ దొరకుతుందో తెలపండి 🙏🙏
GRAMABAZAAR
9491278836
maps.app.goo.gl/g9WC7J7DvEpdejt19
నీ మెయిన్ వృత్తి వ్యవసాయం కాదు పైగా మీదాయంఅధికం. ముందు మీరుదాన్నివదిలి అప్పసం వ్యవసాయం లోనికి మారండి అప్పుడు మిమ్ములను మీ సలహాలు నమ్మవచ్చు అంతవరకు మీవన్నీ కళ్ళబొల్లి కబుర్లే . ఒక వ్యవసాయములో తప్ప, మిగతా అన్నివృత్తులవారు హ్యాపీగా దేశములో బ్రతకవచ్చు. మీలాంటి వారు చెప్పే ప్రకృతి వ్యవసాయం,బొంగు బోషానం అంటూ మీ లాంటి తెలివితక్కువవారి మాటలతో దేశాన్నే వృద్ధరించవచ్చనే మోడీ,కూడా తక్కువఖర్చుతో చేయవచ్చు అనిబ్రమించి రాంగ్ ట్రాక్ లోనే బ్రమిస్తున్నాడు దీవలన ఆర్థికంగాక్రుంగిపోయిన రైతులను సర్వ నాశనం చేస్తున్నారు. దేశములో ఒకప్పుడు వ్యవసాయం చాలా గొప్పగా ఉండినది ఆనాడు బిజినెస్ చేసే వారుఅయితేనేమి ప్రభుత్వం ఉద్యోగాలు చేసే వారుకానీ , అలాగే రాజకీయనాయకులు, పాలకుల ఆదాయం చాలా తక్కువ ఉండి నది అప్పటి ఆనాటి పంటలకు ఉన్నరేట్లు ఆనాటి రైతు ను రాజు అన్నట్లే ఉందినది. కానీ ఈనాడు రైతు పండిన పంట కి ధరలు పెరుగుదల అన్నది అడ్రస్ లేకుండాపోయినది మనముపైన ఉదహరించిన వారి ఆదాయవనరులుఈనాడు లెక్కలేనంతగా పెరిగి పోయినై. దేశములో ఈనాడు టెక్నాలజీ ఉపయోగించుకుని బీదవారిని గుర్తించడముచాలా తేలికే తెల్ల రేషన్ కార్డు వున్నవారు చాలా మంది ఉండవచ్చు వారిలో అధిక ఆదాయం కలిగిన వారు వీరు,ఇళ్ళుకట్టే గౌండాలు, హమాళీలు, అటో వారికి తెల్లకార్డులు రద్దు చేసి మిగతా తిండికిలేని బీదవారు వున్నారు చూడండి వారికిఆహారానికి సంబంచిన దాన్యాలు అన్నికూరగాయలు తక్కువ రెట్లకే అంటే కిలో టమోటాలు రెండు రూపాయలకు అమ్మి, మిగతా ఆదాయం వున్నవారికి ఒక్క టమోటాను 100రూపాయలకు అమ్మాలి. నేను చెప్పేబీదవారికి తప్ప,మిగతా వారు ఇప్పుడు ఎక్కువ ఆదాయం కలిగినవారు. కానీ ఒకప్పుడు పూర్వం రైతుఆదాయం కంటే చాలా తక్కువవుందే వారు కానీమన చెత్త పాలకుల స్వార్తబుద్ధితో ఈనాడువారిఆదాయం అంచనాలకు మించిపోయి ఆదాయం పెరిగింది కనుక జపాన్ దేశములో టమోటా రేటు ఉన్నట్లు మనదేశములో కూడా రైతు పండించే వాటిని జపాన్ లాగా అమ్మితేనే రైతును నిలబెట్టిన వారవుతారు. మీలాంటి ఉచిత,ప్రకృతి సలహాలు దొంగ ట్రెనింగ్ లు మానివేసి,ముందు రైతును ఆర్థికంగా నిలబడేలాచేసిరైతును బ్రతికించాలి దాన్ని, ఆలోచించండి రైతు ఏది కొనాలన్నా వాని ఆదాయం పరిధి తగ్గడముతో ప్రతివస్తువు, ఆఖరుకు రైతుతో పనిచేసే కూలీలు amount కూడా అకాశం లోనికి పోయి అటక ఎక్కికూర్చుంది. ఇప్పుడుమీలాంటి వారు ప్రకృతి, వికృతి అంటూ దొంగ మాటలు చెప్పుతూ ప్రభుత్వం లకు మీరే ప్రకృతి ప్రేమికులు రైతులకు ఏమి తెలియనట్టు మీరే ఓ పెద్దసైన్టిస్టులు మీరే దేశాన్ని ఉద్దరించే నాకొడుకులలాగా చెప్పడమన్నది హాస్యాస్పదం, సంవత్సరములో (364రోజులు )పొలం పనిచేసే వానికి తెలియదా న్యాచురల్ గ పండించేది. రైతుకుసమయానికి డబ్బులేనప్పుడు మీరు చెప్పే ప్రకృతి ట్రిక్కులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు పైగా రైతుకు అన్నీ తెలుసు రైతు అన్నీ చెయ్యగలడు కానీ వాడు పండించిన పంటకు ముందు గిట్టుబాటుధర కావాలి.అదిలేక రైతు చస్తున్నాడు, ఈదేశం లో జై జవాన్, జై కిసాన్ గొప్పగఅని అంటూ ఉంటారు అది అంతా గొప్పగ చెప్పడమువరకే,కానీ ఇక్కడ జవాన్ కు దేశం భద్రతవిషయం లో చాలా ఖర్చు వెచ్చిస్తున్నారుదేశ బద్రతను కాపాడుతూ బాగుగా చూసుకుంటున్నారుఅది అందరం హర్షిస్తాం అలాగే కిసాన్ భద్రతను చూడడములేదు. మీరుముందు దేశములో రైతును మనుగడను మన్నెలా చూడండి. అప్పుడు రైతులే స్వచ్ఛమైన ప్రకృతినే మీకు ఆహారాన్నిమీ నోటిలోనికే పంప గలడన్నదిమీరు దయచేసి తెలుసుకుంటే బావుంటుంది. రైతులను చులకన చేయవద్దని మామనవి.
నరసింహారెడ్డి గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించగలరు. మా గ్రామ బజార్ 33 ఏళ్ల కష్ట ఫలితం ఈ కషాయాలు. శ్రీ గల్లా చంద్రశేఖర్ గారు మరియు వారి బృందం అడవుల్లో తిరిగి సేకరించిన వనమూలికతో సహజసిద్ధంగా తయారుచేయబడినవి.
నిజం తెలుసుకోకుండా మీరు చెప్పిన కొన్ని మాటలు :
*మీ వృత్తి వ్యవసాయం కాదు: మా వృత్తి వ్యవసాయమే. మేమూ రైతులమే.
* ప్రకృతి వ్యవసాయం తెలితక్కువతనం: మీ లెక్క ప్రకారం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేవారు తెలితక్కువ వారు అంటారా? లేక ఆ దిశగా రైతులను
ప్రోత్సహించేవారు తెలివి తక్కువ వారా? వివరణ ఇవ్వండి.
*రైతులు నాశనం అవుతున్నారు: ఒక రైతు నాశనం అవ్వడానికి గల కారణాలు చెప్పగలరా?
*ఆనాడు రైతే రాజు అన్నారు: ఆనాటి వ్యవసాయ పద్ధతులు, పరిస్థితులు ఏమిటి? ఎలా ఉన్నాయి? గమనించుకోగలరు.
*పంటకి ధర సరైన లేదు: రైతుకి గిట్టుబాటు ధర లభించడం లేదు అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. రైతుకి సాగు ఖర్చులు పెరగటం, కూలీల సమస్య, గడ్డిమందులు అధిక రసాయనాలతో కూడిన పరుగుమందులు, క్రిమి సంహారకాలు వాడటం వల్ల పురుగు నివారణ మాట అటుంచితే వాటిలో రోగనిధకత శక్తి పెరిగి సమస్య మరింత విజృంభిస్తోంది. ఫలితంగా నేల సారం క్షీణిస్తోంది. ఇన్ని ఒడుదుడుకులను అధిగమించి పంట పండించినప్పటికీ సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతు కష్టం దళారుల పాలవుతోంది.
*వ్యవసాయ అధికారుల నుంచి సరైన సలహాలు, సూచనలు లేకపోవటం, ఏ పంట ఎలా సాగు చేయాలి? ఎప్పుడు సాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సాగు గిట్టుబాటు అవుతుంది వంటి విషయాలు తెలియక రైతులు సతమతమవుతున్నారు.
*హమాలీలు, మేస్ర్తీలు, ఆటోవారికి నష్టం: ఇక్కడ వీరి గురించి మాట్లాడటం అనవసరం అని మా ఆలోచన.
*జపాన్తో పోల్చడం: వ్యవసాయంతో సుసంపన్నమైన మన దేశాన్ని జపాన్ దేశంతో ఎందుకు పోల్చారు? అక్కడ వ్యవసాయ పరిస్థితులు ఏమిటి? మన దేశంలో ఏం జరుగుతుంది? మన ఆర్థిక పరిస్థితులు ఏమిటి? రైతుని ఎలా ముందుకు నడిపించాలి? వ్యవసాయ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి అనేది మనం ఆలోచించుకోవాలి.
*ఉచిత సలహాలు:
ఇక్కడ ఉచిత సలహాలు అంటున్నారు. మేము ఎవ్వరికి ఉచిత సలహాలు ఇవ్వలేదు. దొంగ ట్రైనింగ్లు అంతకంటే ఇవ్వలేదు. రసాయనాలతో విషమెక్కిన కలుపు మందులు,పురుగు మందులు, ఎరువుల గురించి తెలియజేస్తూ... రైతులు సహజ సైద్యం వైపు వచ్చేలా వారికి అవగాహన కల్పించడంలో మా వంతు కృషి చేస్తున్నాం.
* మరో విషయం... వారిని ఇది చేయండి... ఇలాగే చేయండి... మేము చెప్పిందే వేదం అని ఏనాడూ చెప్పలేదు. రైతులు వారు పాటించిన పద్ధతులు, సాగులో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన ఫలితాలను వారి మాటల్లోనే సాటి రైతులకు తెలియజేస్తున్నాం.
* మేము గుట్టుగా రైతుతో మాట్లాడటం లేదు మా యూట్యూబ్ ఛానెల్(గ్రామ బజార్-తెలుగు) ద్వారా ప్రతి విషయాన్ని వివరంగా పూర్తి రైతాంగానికి చేరవేస్తున్నాం. మాకు తెలిసిన సమాచారం వారికి అందిస్తూ... క్షేత్రస్థాయిలో వారు చూసిన ఫలితాలు, ప్రయోగాలు ఎలా ఉన్నాయనేది మేమూ తెలుసుకుంటున్నాం.
*పొరుగు దేశంలో సాగు ఫలితాలు ఎలా ఉన్నాయో అనవసరం . కానీ మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల రైతులకు సేంద్రియ సేద్యం పట్ల కొంత అవగాహన, అనుభవం రెండూ ఉన్నాయి.
*ఉద్దరించే నాకొడుకుల్లాగా మేము చెయ్యము: మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నాం. మొత్తం మాకే తెలుసు, దేశాన్ని మేమే ఉద్దరిస్తున్నాం అని చెప్పలేదు. అది మా పని కాదు. మొదట రైతుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రకృతి సేద్యం ముసుగులో రైతులు నిజమేదో, అబద్ధమేదో తెలియని దయనీయ స్థితి నుంచి కనీస అవగాహన వచ్చేలా తోటి రైతులతో వారిని కలుపుతున్నాం.
*సైంటిస్టులు కాదు: మేము సైంటిస్టులం కాదు. మా అధ్యయనాలు రసాయనం కాదు. మేము పుస్తకాలను ఆసరాగా చేసుకుని రైతులకు కషాయాలను సిఫారసు చేయడం లేదు. పంట సమస్య, నేల రకం, నీటి యాజమాన్యం, అక్కడి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మా కషాయాలను సిపారసు చేస్తున్నాం.
*మీకు మా గురించి ఎలా తెలిసింది? మా ఉత్పత్తులు వాడిన రైతులతో మాట్లాడారా? రైతుల అనుభవాలతో కూడిన వీడియోలు చూసారా? చూస్తే ఏం అర్థం చేసుకున్నారు? మీరు ఒక రైతు అయితే మీరు పండిస్తున్న పంటలు ఏమిటి? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? పంట సమస్యకు ఎలాంటి పరిష్కారం ఎంచుకున్నారు? వాటి ఫలితాలు ఏమిటి? ఇవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి గ్రామ బజార్-తెలుగు యూట్యూబ్ ఛానెల్లో రైతుల అనుభవాలతో కూడిన కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. దయచేసి ఈ విష।యాన్ని గమనించగలరు.
చివరిగా మా వైపు నుంచి ఒక మాట: మా వృత్తి వ్యవసాయం. మేమంతా రైతులం. రైతులకు ఎరువుల భారం తగ్గించి, సహజ సిద్ధంగా భూసారం, పంట నాణ్యత పెంచడమే మా ప్రయత్నం. సాగుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రయోగం చేసిన తర్వాతనే రైతు దాకా తీసుకువెళ్తున్నాం. మీకు తెలిసిన లేదా మాకు తెలియని విషయాలు మీ వివరిస్తే తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు- గ్రామ బజార్ బృందం.
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గ్రామ బజార్: 94912 78836 ని సంప్రదించండి. లేదా మీ ఫోన్ నెంబర్ మాకు పంపితే మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము.
meru vadi em ayena nastapoyara?memu ayety use chesam maku result chala baga vochindi.verusanaga pantalo
గత ఏడాది వరిపంటలో వాడను నాకు అయితే బాగానే పని చేశాయి.