Garikapati Narasimha Rao Pravachanalu | దేవుని పూజ ఎలా చేయాలి? మహిళలకు గరికపాటి సలహా ..! | EP-128
HTML-код
- Опубликовано: 22 окт 2024
- Garikapati Narasimha Rao Pravachanalu | దేవుని పూజ ఎలా చేయాలి? మహిళలకు గరికపాటి సలహా ..! | EP-128
#garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevot...
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on RUclips: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...
వేంకటేశ్వరునికి మట్టిపిడతలో అన్నం నైవేద్యం విషయం, ప్రాధాన్యత మొదటిసారి విన్నాను గురువుగారూ.
మీకు పాదప్రణామములందిస్తునాము.
Guruvu garu chala baga vivarincharu .meeku maa namaskramulu
Meeku satakoti vandanalu 🙏
Sairam guru garu
చిత్త శుద్ధితో ఒక పూజ కాని ఒక పని కానీ చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.
గరికపాటి వారి ప్రవచనాలు మానవ జీవన విధానానికి ఒక దిక్సూచి. అందరూ అన్వయించుకోవచ్చు.
పాఠశాల ల్లో రోజుకొక పద్యం చెప్తే చాలు.
సాహిత్యం పట్ల అవగాహన వస్తుంది.
తెలుగులో ఉన్న సాహిత్య సంపద వేరే ఏ భాషలోనూ లేదు .
❤❤❤❤❤❤
భగవంతుడికి ఏదో ఒకటి పెట్టాలి అని మీరు చెప్పిన విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు చూడండి సర్.
రాజవిద్యా రాజగుహ్య యోగము
శ్లో|| 26: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి ।
తదహం భక్త్యు పహృత మశ్నామి ప్రయతాత్మనః ||
(పరమాత్మ)
భావము : ఆకు అయిన, పుష్పమైన, పండైన, నీరైన ఎవడు భక్తితో సమర్పించునో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తి పూర్వకముగ సమర్పించిన దానిని నేను స్వీకరింతును.
వివరము : ఒక ఇంటిలో ఆరు మంది వ్యక్తులున్నారు. వారి పేర్లు వరుసగ 1) లింగడు 2) రంగడు 3) భీముడు 4) సోముడు 5) రాముడు 6) వెంకట్రాముడు. వీరిని గుర్తించి పిలుచుటకు ఆరు పేర్లు పెట్టబడినవి. రామున్ని పిలిస్తే రాముడే వస్తాడు. రంగన్ని పిలిస్తే రంగడే వస్తాడు. అట్లుకాక రాముడిని పిలిస్తే లింగడు రావడము, లింగన్ని పిలిస్తే సోముడు రావడము జరుగదు. అట్లు వస్తే వారికి పిచ్చి పట్టిందంటాము. వీరి మాదిరే శరీరమను ఇంటిలో 1) మనస్సు 2) బుద్ధి 3) చిత్తము 4) అహము 5) భూతము (జీవుడు) 6) తత్త్వము (ఆత్మ) అను పేర్లు కల్గినవారున్నారు. ఎవరిపేరు పిలిస్తే వారు పలికిన పరవాలేదు. అట్లుకాక ఒకరిపేరు పిలిస్తే మరొకరు పలికిన వారిని తెలివి తక్కువవారనవచ్చును. ఇక్కడ పలికేవారు కరెక్టుగ పలికిన, పిలిచేవారు ఒకరి పేరుపెట్టి ఇంకొకరిని పిలిచారనుకొందాము. అప్పుడు పిలిచేవారే బుద్ధిహీనులని చెప్పవచ్చును. ఇదంతా ఎందుకు చెప్పుచున్నా మనగా! ఈ శ్లోకములో అలాగే వ్రాయబడివుంది. 'ప్రయతాత్మనః' అను మాటకు ఒకరేమో పరిశుద్ధమైన బుద్ధి అన్నారు. మరొకరేమో పరిశుద్ధమైన మనస్సు అన్నారు. శరీరమనే ఇంటిలో తత్త్వము అనువాడు వేరు, బుద్ధి అనువాడు వేరు, మనస్సు అనువాడు వేరు, వేరు వేరుగనున్న వారిని శ్లోకములో తత్త్వము అని చెప్పినప్పుడు దానిని బుద్ధియని ఒకరు చెప్పడము, మనస్సని మరొకరు చెప్పడము చూస్తే ఏమనిపిస్తుంది? వారికి పిచ్చియనిపిస్తుంది కదా! 'ప్రయతాత్మనః' అన్నపుడు పరిశుద్ధమైన ఆత్మ అని అర్థము. ఆత్మను వదలి ప్రక్కవారిని చెప్పుకోవడము పొరపాటు. ఇటువంటి మాటలను చూచి హేతువాదులు ఆధ్యాత్మికము, ఆత్మ అన్ని బూటకము అంటున్నారు.
పత్రమ్, పుష్పమ్, ఫలమ్, తోయమ్ అనువాటిలో దేవునికి ఏ ఒక్కదానితోను అవసరము లేదు. అయినప్పటికి వీటి పేర్లు చెప్పడములో కొంత విశేషముందను కుంటాము. తోయము అనగా నీరు, పత్రము అనగా చెట్టుకున్న ఆకు, అలాగే పుష్పము, ఫలము నాలుగు చెట్టుకున్నవే. సాధారణముగ ఆకు చెట్టు మీద ఒక సంవత్సరము వరకు ఉండి రాలిపోవును. ఫలము కొన్ని దినముల వరకుండును. పుష్పము ఒక్క దినము మాత్రముండును. ఈ మూడిటిలో ఉన్న నీరు మాత్రము శాశ్వితముగ ఉండును. ఈ విధముగ ఒక్క దినము మాత్రముండు పుష్పమునుగాని, ఒక వారము దినములుండు ఫలమునుగాని, ఒక సంవత్సర కాలముండు ఆకునుగాని, శాశ్వితముగ ఉండు నీరునుగాని చెప్పడములో అశాశ్వితమైనవి మూడు, శాశ్వితమైనది ఒకటిగా అర్థమైనది. అశాశ్వితమైన వాటిలో కూడ ఒక దినము, ఒక వారము, ఒక సంవత్సరకాలము వరకుండు వాటిని చెప్పాడు. ఈ మూడు చర ప్రకృతికి సంబంధించినవి. శాశ్వితమైన నీరు మాత్రము అచర ప్రకృతికి సంబంధించినది. ఈ విధముగనే మన శరీరములో కొంత తేడాలతో మార్పు చెందు మూడు గుణ భాగములు, ఏ తేడా లేకుండ మార్పు చెందని ఆత్మ భాగము గలదు. మూడు గుణములలోని తామసుడు, రాజసుడు, సాత్త్వికుడు అను జీవుడు ఎప్పటికైన నాశనముకాగల అశాశ్వితమైనవాడని, ఆత్మ భాగములోనున్న వాడు నాశనము కానివాడని తెలియుచున్నది. శాశ్వితముకాని గుణములను, శాశ్వితమైన యోగమును వదలినవాడు నావద్దకు చేరునని చెప్పడమే ఈ శ్లోకములోని అర్థము.(కంటిన్యూ చేస్తూ)
ప్రస్తుతరుణంలొ తరగతులలొతెనుగు పాఠక విద్యార్ధు లె కరువవుతునారు ఇంతటి సాహిత్యంపట్ల ,సంఘంలొఆనాడు జరిగెఈతోలిబొమ్మలాట లందు నేటి ఈసమాజంలొ ఏమాత్రం అవగాహనుండదని నాభావం.మీలాబోధనాపటిమగల ఉపాధ్యాయులు ముందుముందు కనుమరుగైపోతారుఅలా ఆశించడంకూడా అవివేకవేమో అని అనిపిస్తుందినాబోటివాళ్ళకి.
❤1
❤❤❤❤¹¹❤
అసలు దేముడు ఎవరు? దేముడికి ఏదయినా ఎందుకు పెట్టాలి అని ప్రశ్నిస్తే సమాధానం. అసలు జీవి ఎవరు? ఎక్కడినుంచి జీవం వచ్చింది. ఈ జీవులలోని జీవాన్ని ఎవరు ప్రసాదించారో ఆ శక్తే దేముడు. మనకి ఇష్టమైన అమ్మ నాన్న, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు, పిల్లలు మొదలైన వాళ్ళ ఫోటో పెట్టుకుని చూసుకుని మురిసిపోతూ ఉంటాము కదా. వాళ్ళందరి మీద ప్రేమ ఉంటుంది కదా.మరి మనలో జివానికి కారణమైన దైవ శక్తిని ఒక రూపము తో భావించుకుని ఫోటో పెట్టి ప్రేమతో ఆరాధించడానికి మీకు ఎందుకు మనసు రాదు. ప్రేమ ఉన్నచోట భక్తి తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనవాడని భావించామో మనతో పాటే ఉన్నాడని భావించమో మనం ఆహారం తీసుకున్నట్టు భగవంతుడికి కూడా పెట్టాలన్న భావన వస్తుంది. అందుకే భక్తితో పెడతాము. మన దేహం పంచభూతాలతోనే తయారయ్యింది కాబట్టి ఆ పంచభూతాలన్ని ఎవరిలోనుంచి వచ్చాయో ఆ పరమాత్మకు కూడా ఆహారం సమర్పించుకోవడం మనలోని నిజాయితీని కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది. మనలోని ప్రాణ శక్తి భగవంతునికి ప్రతిబింబం.
Hyderabad lo vengalarao nagar school lo Bassavamma Telugu teacher garu Baptala Tenali vastavuralu maaku Telugu paatalato batuga manchi manchi vishyalu cheppevaru. Chala andanga anadamga vundevaru .❤
Batakadaniki adaina vyaparam chesukovalandi
(ముందు కామెంటుకి కొనసాగింపుగా
పై ఐదవ ప్రశ్నకు జవాబును చూస్తే దేవుని దృష్ఠిలో ఖరీదైనవని, చౌకగ లభించునవని భావములేదు. ఏ చెట్టులేని చోట మన్ను లభించుననుట వాస్తవమే అయినప్పటికి, ఆయన బయట కనిపించే చెట్లను గురించి, వాటికి లభించే ఆకులు, పూలు, కాయలను గురించి చెప్పలేదు. అందరి శరీరములోనున్న చెట్టును గురించి చెప్పాడు. కొంత జ్ఞానము తెలిసినవాడు శరీరమునే వృక్షముగ తలచి, అందులోని ఆత్మశక్తినే నీరుగ, పూవులను, కాయలను, ఆకులను మనలోపలనున్న గుణస్థానములుగ తలచి, దేవుడు వాటిని వదలుకొమ్మన్నాడని గ్రహించవలసియున్నది. లోదృష్ఠి లేకుండ బయట దృష్ఠితో చూస్తే అంతా అపార్థమే అగును. చివరకు దేవుడు కూడ మనుషులవలె ఆశగలవానిగ అర్థమగును. అట్లుకాక దేవుడు చెప్పినది ఆత్మజ్ఞానమని, ఆధ్యాత్మికముతో తనవద్దకు చేరు సూత్రములను తెలియచేశాడని, జ్ఞానముతో చూచినపుడే దేవుని శ్లోకము పూర్తి అర్థము కాగలదు. దేవుని వలననే అన్ని మనకు లభ్యమగుచున్నపుడు, అన్నిటిని దేవుడే సృష్ఠించుచున్నపుడు, దేవునికి వాటితో పనేమి ఉంటుందని యోచించండి. ఈ శ్లోకము ప్రకారము నడుచుకోవాలంటే ఏ విధముగ ఉండాలో ఆ విధానమును కూడ క్రింద శ్లోకములోనే చెప్పాడు. ఈ శ్లోకముకంటే ముందు చెప్పిన శ్లోకములో ఏమి చెప్పాడో, ఈ శ్లోకము తర్వాత ఏ విధముగ చెప్పాడో, పరిశీలిస్తే మధ్యనున్న ఈ శ్లోకము యొక్క అసలైన పూర్తి భావము అవగాహన కాగలదు. అందువలన అన్ని భగవద్గీతలలో ఈ శ్లోకమును చదివినట్లు ఇక్కడ లేదని తెలుపుచున్నాము. అందరిది కాదని నీవు చెప్పే అర్థము ఏ నిఘంటువులో ఉందని మాత్రము అడుగవద్దండి.
😮(ముందు కామెంటుకి కొనసాగింపుగా)
4) మనకున్న ధనమో, ధాన్యమో, వస్తు వాహనమునో అడగక ప్రత్యేకించి ఆకు, పూవు, కాయ, నీరు అని అడగడమేమిటి?
జవాబు : దేవుడు అడిగితే ఎంత విలువకల్గిన వాటినైన ఇచ్చుటకు సిద్ధముగనున్న మనుషులు భూమి మీదుండగా, అడగకనే కోట్ల డబ్బును, విలువైన వజ్రాలను హుండీలలో వేయు భక్తులుండగా, అడిగేదేదో పెద్దవి అడిగి ఉండవచ్చును కదా! లేకపోతే అడగకుండ అయిన ఉండాలి. అడిగి మరీ అంత చౌకైన వాటిని కోరడము చూస్తే, దేవుడు చాలా తెలివి తక్కువవానిగ కన్పిస్తున్నాడు కదా! ప్రపంచములోని గొప్ప తెలివున్న వారిలోని తెలివిని కూడ నేనే, అన్నవాడు తెలివితక్కువ వాడెట్లగును? ఆయన చెప్పిన దానిని అర్థము చేసుకోలేని మనుషులే తెలివితక్కువ వారు. దేవుడు తాను గీచిన దేహమనబడు గీతలోపలి విషయమునే సూత్రము ప్రకారము కోరుచున్నాడు కాని, శరీరము యొక్క హద్దుకు బయటనున్న వస్తువులను కోరలేదు. ఆకులు, కాయలు, పూలు, నీరు శరీరమునకు బయటివే కదా! అని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి జవాబు, చెట్టు కూడ ఒక శరీరమేనని, అందులో కూడ జీవుడున్నాడని మరచిపోకూడదు. జీవుడు దేవుని వద్దకు చేరవలెనంటే, జీవాత్మ నాలుగు స్థాయిలను దాటి పోవలసిందే, ఆ నాలుగు స్థాయిలను సమానముగ తెలుపునవి చెట్టులోని నాల్గు భాగములే, ఆధ్యాత్మిక ప్రమాణమునకు సరిపడునవి చెట్టులోని ఆకులు, పూవులు, కాయలు, నీరు కనుక వాటినే పేరుపెట్టి చెప్పవలసివచ్చినది. దేవునికి వస్తు వాహనములతో గాని, ధన కనకములతో గాని పనిలేదు. అందువలన దేవునికి అవసరములేని డబ్బును, వజ్రాలను, బంగారును సమర్పించే దానికంటే గుణాలున్న మరియు గుణములులేని వాటిని ఆయనకు ఇవ్వడము మంచిది. ఆ విధానమును తెల్పుటకే ప్రత్యేకించి "యాన్తి దేవ వ్రతాన్ దేవాన్" అను శ్లోకము తర్వాత ఈ విషయమును చెప్పాడు. దీనికంటే ముందు శ్లోకములో దేవతలను పూజించువాడు, దేవతలనే చెందుతాడు నన్ను చెందడన్నపుడు, దేవతల యొక్క పూజలనే దేవుడు వద్దని చెప్పినట్లు కదా! అటువంటపుడు గుడికి పోయి పూజలో ఆకులు, కాయలు, పూలు, నీళ్లు పెట్టమని చెప్పునా! మీరే ఆలోచించండి. దేవతారూపములే ఆరాధనలో లేనపుడు పూలు, కాయలు ఎక్కడ పెట్టాలని యోచించారా? యోచిస్తే కాయలు, పూవులు, ఆకులు వెనుక పెద్ద రహస్యమే అర్థము కాగలదు.
5) ఏ చెట్టు లేనిచోట మనిషి ఉంటే అక్కడ ఇవి ఏవి లభించవు కదా! అప్పుడు వీటికంటే చౌకగా దొరుకు, ఎక్కడైన లభించు మట్టినైన ఇవ్వవచ్చునని ఎందుకనలేదు?
జవాబు : కొన్ని భగవద్గీతలలో కొందరు రచయితలు ఇది బీద భక్తులను గురించి చెప్పిన శ్లోకమని వ్రాశారు. మరియు "ధనికులు సమర్పించే నైవేద్యములు, ధనము, బంగారు మా వద్దలేదే అని చింతించ తగదు. దేవునికి భక్తితో పత్రము, పుష్పము, ఫలము, తోయము అను వాటిని ఇచ్చిన సరిపోవును. ఇవి విలువ లేనివే అని ఏమి అనుకోక దేవుడు వాటిని కూడ ప్రేమతో తీసుకొనును" అని వ్రాశారు. ఈ విషయమును చదివిన ఒక పిల్లవాడు ఈ విధముగ మాట్లాడుచు "ధనికులైన భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కొన్ని కోట్ల డబ్బును, ఎంతో విలువ చేసే బంగారును, ఖరీదైన వజ్రాలను హుండీలో వేసి వస్తున్నారు కదా! ఏమిలేని బీద భక్తులు తిరుపతికి పోతే వారిని కూడ వదలకుండ పూలో, కాయలో, ఆకులో ఇవ్వమని అడగడము చూస్తే దేవుడు చాలా ఆశపోతని, బీదవారి దగ్గరనుండి కూడ ఏదో ఒకటి తీసుకోవాలను ఆశకల్గినవాడని మాకు అర్థమవుతుంది. బజారులో పూలు అమ్మేవాల్లే పూల ప్రక్కనే ఆకులు అమ్ముతున్నారు. కాయలమ్మే చోటే వాటర్ బాటిల్లు (నీళ్ల సీసాలు) అమ్ముతున్నారు. నీళ్లుకాని, పండ్లుకాని, పూలుకాని, ఆకులుకాని అన్ని కొనవలసిందే, డబ్బులు లేని భక్తునికి వాటిని కొనాలన్నా ఇబ్బందే కదా! ఇదంతా చూస్తూవుంటే వచ్చేటపుడు ఉత్తచేతుల రావద్దు ఏదో ఒకటి తీసుకొనిరా అని పుట్టింటినుంచి వచ్చే కోడలుకు అత్తగారు చెప్పినట్లువుంది. ఏదో ఒకటి లాభము రావాలని చివరకు పూలు, కాయలు, ఆకులు, నీళ్లు అడుగుచున్న దేవుడు చాలా ఆశగలవాడే" అని అమాయకముగ అడిగాడు. ప్రక్కనేవున్న మరొక పిల్లవాడు ఏదో ఒకటి దేవుడు మనకివ్వాలి కాని, దేవుడే ఏదో ఒకటి ఇమ్మని మనలను అడగడమేమిటని ప్రశ్నించాడు. ఇలాంటి ప్రశ్నలు ఇతరులకు కూడ వచ్చి వారి మనస్సులో దేవునికున్న విలువ పోయే అవకాశము గలదు. అందువలన ఇతర భగవద్గీతలలో చెప్పినట్లు ఈ శ్లోకము బీద భక్తులకు చెప్పినదికాదని, ఈ శ్లోకములోని విషయమును మనుషులందరికి చెప్పినదని గ్రహించుకోవలెను.(కొనసాగింపు తర్వాత కామెంట్ చూడండి)
-Told by Frederick Louis Donaldson in westminister Abbey in 1925., 7 sins.
Namaskaaram jai shri ram