80% పిల్లల భవిష్యత్తుని అంధకారం చేస్తున్న స్కూలు విద్య || Dr. Jayaprakash Narayan
HTML-код
- Опубликовано: 16 сен 2024
- #nep2020 #educationsystem #jayaprakashnarayana #loksatta
మన దేశంలో కుల మనస్తత్వం వల్ల విద్యను ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థనిర్లక్ష్యం చేశాయనే వాదనను తోసిపుచ్చలేమని, దీనికి తోడు ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాల్ని నిర్వీర్యం చేసి మొక్కుబడి పరీక్షలతో అందరినీ పాస్ చేయటం మొదలుపెట్టారో పాఠశాల చదువు దిగజారి విద్యాప్రమాణాలు అధ్వాన్నమయ్యాయని ప్రజాస్వామ్య పీఠం (FDR ), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Prime 9 Education 'మేధోమథనం విత్ డా.సతీష్' కార్యక్రమంలో అన్నారు.
విద్యలో ప్రమాణాలు దారుణంగా ఉన్నాయనే విషయం గత కొన్నేళ్లుగా కొన్నిసర్వేలు చెబుతున్నా ప్రభుత్వాలు బుకాయిస్తూ వచ్చాయని, ఇక దాచలేక ఇప్పుడు సంక్షోభాన్ని ఒప్పుకుంటున్నా విద్యాప్రమాణాల అంశం ఇంకా పార్టీలు, మీడియా, సమాజంలో పూర్తిగా ఇంకలేదని.. విద్యలో విజయానికి కొలమానాలు మార్చి ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత వ్యవస్థదేనని JP స్పష్టం చేశారు.