How to recharge borewell ఎండిపోయిన బోరు రీఛార్జి ఎలా చేసుకోవాలి
HTML-код
- Опубликовано: 19 окт 2024
- ఎండిపోయిన బోరుని రీఛార్జ్ చేసుకోవచ్చా
బోరులో నీరు ఇంకిపోతే తిరిగి ఎలా భూగర్భ జలం పెంచాలి
అసలు బోరు రీఛార్జ్ చేస్తే నిజంగా నీటి లభ్యత పెరుగుతుందా
బోరు రీఛార్జ్ విషయంలో మంచి మోడల్ ఉందా
బోరు రీఛార్జ్ సక్సెస్ రేటు ఎంత
బోరు రీఛార్జ్ వల్ల నిజంగానే భూగర్భ జలాలు పెరుగుతాయా
బోరు రీఛార్జ్ తోపాటు భూగర్భ జలాలు పెంచాలంటే రైతులు ఏమి చేయాలి
భూగర్భ జలాల పెంపులో మల్చింగ్, ట్రెంచింగ్, ఆర్గానిక్ ఫామింగ్ ప్రాధాన్యత ఏమిటి
Thank you so much. I was waiting for this video from you. And please upload thenext successful recharge pit model. Thanks for your efforts anna. Great serving for the mother Earth
Tq కిశోర్
మంచి information ichhaavu
Weighting for next video.😊
Masthu cheppav bro...
అన్న..మాకు ఒక ఎకరా పొలం వుంది..దానికి నీటి సౌకర్యం లేదు..bore వేసుకోవాలా ..లేక విజయ రామ్ గారు చెప్పినట్లు చెరువు తవ్వుకోవాల
మీ పొలము చుట్టూ ప్రక్క రైతులు అందరూ నీటి కుంటలు తిపించకోవలి, చిరు ధాన్యములు , నూన్ గింజలు, పప్పు ధాన్యములు పండిచలి
బోరు వేసుకోవాల లేక పంట కుంట తవ్వుకోవాల అన్నది మీ నేల స్వభావం, మీరు వేసిన పంటని బట్టి ఉంటుంది.
ఇక్కడ చెప్పే అంశాలనిబట్టి మీరే నిర్ణయం తీసుకోండి.
1. మీ నేల పల్లంలో ఉందా... మెరక మీద ఉందా
2. ఉద్యాన పంటలా లేక వార్షిక పంటల
3. బోరు వేస్తే ఎన్ని అడుగులలో నీరు పడుతుంది.
4. బోరు వేస్తే ఎన్ని అంగుళాల డెలివరీ ఉంటుంది
5. బోరు నీరు ఉప్పగా ఉందా... తియ్యగా ఉంటుందా
మీరు సాగు చేసేది వార్షిక పంటలైతే... పంట కుంట సరిపోతుంది.
లేదు కూరగాయలు, పండ్లు సాగు చేస్తామంటే... బోరు, పంట కుంట రెండు ఉంటే మేలని నేను చెబుతాను.
ఎందుకంటే...1. ఏటా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి కాబట్టి... మీరు బోరు వేసినప్పుడు 2 అంగుళాలకంటే డెలివరీ తక్కువ ఉంటే... మీరు డ్రిప్ ద్వారా అందించే నీటి ప్రెజరు సరిపోదు.
అలాగే మీ బోరు నీరు ఉప్పగా ఉంటే... దాని ద్వారా మీ పంట సరిగా పండదు.
కాబట్టి... బోరు వేసుకొని... ఆ బోరు నీటిని చిన్న పంట కుంటలోకి పెట్టుకొని డ్రిప్ కి అందిస్తే... ప్రెజర్ సమస్య ఉండదు.
2. క్షార నీరు అంటే సెలినిటీ ఎక్కువగా ఉన్న నీటిని సరిచేసేది ఒక్క వర్షం మాత్రమే. అందుకే బోరు నీరు, వర్షం నీటితో నిండిన పంట కుంట నీరు కలిస్తే పంటకి లవణాల సమస్య ఉండదు.
3. పొలం చుట్టూ కందకం, కంచె మొక్కలు వేసుకొని... సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే... 4 ఏళ్లలో మీ పొలంలో మైక్రో క్లైమేట్ క్రియేట్ అవడంతోపాటు సూక్ష్మ జీవరాశి సంతతి పెరుగుతుంది. అప్పుడు సహజంగానే మొక్కలకి నీటి అవసరం తగ్గుతుంది.
4. ఇలా చేయడంవల్ల మొదటి రెండు మూడు సంవత్సరాలలో పంట కుంటలో నీరు ఎండిపోయే సమస్య తర్వాత తగ్గిపోతుంది
5. పంట కుంట లోతు వీలైతే 15 అడుగులకిపైగా ఎంత వీలైతే అంత అంటే 25 అడుగుల వరకు తవ్విస్తే నీటి ఆవిరి అవ్వడం తగ్గిపోతుంది. నీటి ఆవిరవ్వడాన్ని నియంత్రించడంకోసం ఇప్పుడు పాలీ షీట్లు వచ్చాయి. అవి వేస్తే పంట కుంటలో నీరు పెద్దగా ఆవిరవ్వదు.
6. ఎకరం విస్తీర్ణంలో 10 సెంట్లలో పంట కుంట ఎక్కువ అనుకుంటే... 5 సెంట్లలో తవ్వించినా సరిపోతుంది. తక్కువ విస్తీర్ణంలో తవ్వించేటప్పుడు లోతు ఎక్కువ తీస్తే చాలు.
పైన చెప్పిన విషయాలని గమనించి... నిర్ణయం తీసుకోండి.
ధన్యవాదాలు,
పావులూరి కిశోర్ బాబు,
వ్యవసాయ జర్నలిస్టు.
Anna ... విజయ రామ్ గారు..మనకు వున్న పొలంలో పది శాతం చెరువు తవ్వుకోవాలి అంటారు కదా అందులో నీళ్ళు ఎప్పుడు వుండవు కదా.యింకి పోతాయి కదా..అప్పుడు మనం ఎం చెయ్యాలి..
మీరూ, మీ చుట్టూ ప్రక్క రైతులు నీటి కుంటలు త్రావ్వలి, వాలుకి అడ్డముగా 50అడుగులుకి 1మీటర్ వెడల్పు 1మీటర్ లోతు కాల్వ త్రవల్లి