ఖమ్మంలో ఇంటింటికి తిరుగుతూ.. వరద బాధిత కుటుంబాలకు నిత్యవసరాలు అందజేసిన గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ
HTML-код
- Опубликовано: 15 сен 2024
- #juses #news #telangana #congress #hyderabad #india #khammam #mulugu #venkatapuram #cpi @newsworldtelugu19
మున్నేరు వరదలతో అతలాకుతలం అవుతున్న ఖమ్మం ప్రజలకు అండగా నిలిచేందుకు ఖమ్మం లోని గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ ముందుకు వచ్చింది.
బాధితుల బాధలకు స్పందించి సెప్టెంబర్ 2 నుండి పరివాహక ప్రాంతమైన బొక్కల గడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, జలగం నగర్ తదితర ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
ఇంటింటికి తిరుగుతూ.. వరద బాధిత కుటుంబాలకు ఆరు రోజులు గా భోజనం, అల్పాహారం, దుప్పట్లు, చీరలు, నిత్యావసర సరకులు, బియ్యం తదితరాలను 5 వేల కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ చైర్మన్ ఎం జాకాబ్ మాట్లాడారు.
తమ సంస్థ ఇండియా ఆరోగ్య రంగాలలో పాటు సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అవుతోందని తెలిపారు.
కార్యక్రమాలలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, సహాయక బృందం పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు.